బాధితుడికి ఆర్థిక సాయం
SKLM: ప్రాణాపాయ స్థితిలో ఉన్న లోకేష్కు మెంటాడ వెంకట స్వరూప్ రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లోకేష్ను పరామర్శించి, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.