లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
UAEలోని ఓ ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లాటరీ అయిన ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ సిరీస్లో ప్రవాసుడైన శరవణన్ రూ.60.42 కోట్లు గెలుచుకున్నారు. అబుధాబిలో నివసించే వెంకటాచలం గత అక్టోబర్ 30న ‘463221’ నంబరుతో ఉన్న టికెట్ను కొనుగోలు చేయగా.. ఈనెల 3న డ్రాలో జాక్పాట్ తగిలింది.