CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
PLD: సీఎం సహాయనిధి పేదల పాలిటి పెన్నిదని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 38 మంది లబ్ధిదారులకు, 32.98 లక్షలు చెక్కులను శనివారం తన కార్యాలయంలో అందజేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.