VIDEO: లక్ష్మీనగర్లో చైన్ స్నాచింగ్
ATP: జిల్లాలోని లక్ష్మీనగర్కు చెందిన రఘునాథ్ రెడ్డి భార్య మాధవి లత మెడలోంచి దుండగులు 5 తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయానికి వెళ్తున్న ఆమెపై ద్విచక్ర వాహనంలో వచ్చిన దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. గొలుసు లాక్కోవడంతో మహిళ కిందపడి గాయపడింది.