డ్రగ్స్ డీ-అడిక్షన్ సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్
MNCL: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 7 పడకలతో ఏర్పాటు చేసిన డ్రగ్స్ డీ-అడిక్షన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఈ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత, తదితరులు పాల్గొన్నారు.