కాశీ,అయోధ్య బస్సు ప్రారంభించిన డిపో మేనేజర్
NRML: ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో కాశీ, అయోధ్య బస్సును డిపో మేనేజర్ పండరి నేడు ప్రారంభించారు. ఈ బస్సు మైహార్, ప్రయాగరాజ్, కాశీ, అయోధ్య, నైమి శారణ్య, ఉజ్జాయిని, ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రలకు వెళ్లి వస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల ఆదరణ తో అయోధ్యకు నాలుగో సారి సర్వీసును నడుపామని అన్నారు. ఈ యాత్ర అనంతరం గోవా, రామేశ్వరం టూర్ ఉంటుందని ఆయన తెలిపారు.