VIDEO: ఆర్డీటీకి FCRA పునరుద్ధరించాలని పెనుకొండలో ర్యాలీ
సత్యసాయి: పెనుకొండలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆర్డీటీ సంస్థకు FCRA పునరుద్ధరించాలని కోరుతూ శనివారం ర్యాలీ నిర్వహించారు. బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్డీటీ సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఆర్డీటీ సేవలకు ఆటంకం కలిగించడం దురదృష్టకరమని అన్నారు.