అర్ధనారీశ్వరిగా శ్రీ విరుపాక్షి మారెమ్మ

అర్ధనారీశ్వరిగా శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణంలోని బస్టాండ్ సమీపాన వెలసిన శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం అర్ధనారీశ్వరుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయమే అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం విభూది, పసుపుతో అమ్మవారిని అర్ధనారీశ్వరునిగా అలంకరించారు. పూజల అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.