గొల్లపూడి లో ప్రజా దర్బార్ కార్యక్రమం
NTR: ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజాసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతివారం క్రమం తప్పకుండా 'ప్రజాదర్బారు' ను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. గొల్లపూడిలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా 500 మంది ప్రజలు అర్జీలు సమర్పించారు.