రాష్ట్రానికి కేంద్రం తీపికబురు

AP: రాష్ట్రానికి కేంద్రం తీపికబురు చెప్పింది. యూఐడీఎఫ్ కింద రాష్ట్రానికి మొత్తం రూ.1,067 కోట్లను కేంద్రం నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు ఈ నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు నెల్లూరు- బద్వేలు కారిడార్ నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కారిడార్తో స్థానికంగా కనెక్టివిటీ పెరగటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.