నీటి సరఫరాలో అంతరాయం..

SRD : తాగునీటి పైప్ లైన్ లీకేజీ కారణంగా 28వ తేదీ వరకు మూడు రోజులపాటు తాగునీటి సరఫరా ఉండదని మున్సిపల్ కమిషనర్ ఉమా మంగళవారం ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి చౌరస్తా వద్ద తాగునీటి సరఫరా పైప్ లైన్ లీకేజీ అయిందని, మరమ్మతులు చేసే వరకు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకో వాలని సూచించారు. పట్టణ ప్రజలు సహకరించగలరని ఆమె కోరారు.