'అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి'
ELR: ఐదు సంవత్సరాల పాలనలో అందరి సహకారంతో అభివృద్ధి చేశానని సర్పంచ్ దిడ్ల అలకనంద శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పాలకవర్గం పూర్తి కావడంతో పంచాయితీ అభివృద్ధి అధికారి విజయ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయితీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.