టీడీపీ కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మొహమ్మద్ యాకోబ్ మృతిచెందడంతో బుధవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పార్ధివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.