నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
ELR: ఏలూరు మండలం శాంతినగర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ తీగల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులను చేపట్టనున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. ఈ కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శనివారపుపేట, దొండపాడు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.