VIDEO: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గోవు మృతి

VIDEO: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గోవు మృతి

ATP: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవి ప్రాణాలు కోల్పోయింది. రాయదుర్గంలోని మొలకల్మూరు రోడ్డులో గొల్లపల్లి రూటు మలుపు వద్ద గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. భూమికి 3 అడుగుల ఎత్తు కూడా లేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద మేత మేయడానికి వెళ్లిన గోవు ప్రమాదవశాత్తు మృతి చెందింది. స్థానికులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.