రికార్డ్ సృష్టించిన భారత్-ఇంగ్లండ్ సెమీస్

రికార్డ్ సృష్టించిన భారత్-ఇంగ్లండ్ సెమీస్

భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జియోహాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ క్రీడలోనైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంతమంది ఒకేసారి చూడటం ఇదే అత్యధికం. రేపు జరిగే ఫైనల్ ఈ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.