ఈ నెల 13న నేషనల్ అప్రెంటీస్ మేళా
GNTR: తెనాలి చిన రావూరులోని ప్రభుత్వ ITI శిక్షణ కేంద్రంలో ఈ నెల 13న నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ITI ఉత్తీర్ణులైన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పారు. అప్రెంటిస్ మేళాలో 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్నారు. ITI విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.