'సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి'

'సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి'

ఎన్టీఆర్: ప్రజాదర్బార్‌కు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు అధికారులను ఆదేశించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గొల్లపూడిలోని వారి కార్యాలయంలో గురువారం ప్రజాదర్బారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీలు స్వీకరించారు.