అంగరంగ వైభవంగా శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం
సిద్ధిపేట మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామంలో ఉన్న శివాలయంలో శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కరీంనగర్కు చెందిన ఓ భక్తుడు శివలింగాన్ని సమకూర్చగా, గ్రామానికి చెందిన భక్తుల సహకారంతో ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.