'పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి'
ADB: ప్రతి పండుగను ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇఫ్తార్ విందు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను కూడా చాటుతుందని కంది శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.