VIDEO: హుజురాబాద్లో బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బైక్ ర్యాలి నిర్వహించి, జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ నిర్మించవద్దంటూ నినాదాలు చేశారు. ఈ బంద్ను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా పాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.