ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని కుల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత కుంకుమ, గంధం, కాటుకతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.