VIDEO: పాఠశాల ఆవరణం బురదమయం

KRNL: దేవనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణం వర్షపు నీటితో నిండి బురదగా మారింది. విద్యార్థులు ప్రార్థన సమయంలో మురుగు నీటిలో నిలబడి ప్రార్థన చేయాల్సి వస్తోందని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని అద్యాపకులు గురువారం తెలిపారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు.