హైవేపై యాక్సిడెంట్‌లో మహిళ మృతి

హైవేపై యాక్సిడెంట్‌లో మహిళ మృతి

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలిచిపురి శివారులో జాతీయ రహదారిపై నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా నుంచి బాసరకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును నిలిపిన సమయంలో రోడ్డు పక్కన ఉన్న కడియాల రమణమ్మ(55)ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు