ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి  విస్తృతంగా తీసుకెళ్లాలి

ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ చెప్పారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన 45,47 డివిజన్లలోని కుటుంబ సాధికార సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలన్నారు. తద్వారా పార్టీ బలపడుతుందన్నారు.