సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం రూ. 5.59 లక్షలు

సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం రూ. 5.59 లక్షలు

కృష్ణా: ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి గురువారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా రూ.5,59,330 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారు జాము నుంచి స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో చెప్పారు.