ప్రత్యేక చికిత్స విభాగాన్ని ప్రారంభించిన డీసీపీ
PDPL: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి శనివారం ప్రారంభించారు. మద్యపానం, నిషేధిత గంజాయి, పొగాకు వంటి హానికర వ్యసనాలకు లోనైన యువతకు ప్రత్యేక చికిత్స అందించేందుకు ఈ సెంటర్ను ఏర్పాటు చేసిందని, చెడు వ్యసనాల నుంచి యువతను విముక్తి కల్పించేందుకు ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.