తిరుపతి రూరల్కు నిధులు మంజూరు
TPT: తిరుపతి రూరల్ మండలంలో వేసవి నీటి కష్టాలు నివారించడంతో పాటు పలు అభివృద్ధి పనుల కోసం జడ్పీ నుంచి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో తిరుపతి రూరల్ ఎంపీపీ మాధవరెడ్డి సమగ్ర నివేదికను సీఈవో రవికుమార్ నాయుడు, జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులకు అందించారు. ఈ మేరకు రూ.44 లక్షలు విడుదల చేయగా ఎంపీపీ సంతృప్తి వ్యక్తం చేశారు.