విద్యుత్ షాక్ తో ఆవు మృతి

విద్యుత్ షాక్ తో ఆవు మృతి

NRML: దిలావర్‌పూర్ మండలంలోని బన్సపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఆవు మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. రైతు రవికి చెందిన గర్భిణీ ఆవు మేతకు వెళ్ళి ట్రాన్స్‌ఫార్మర్ ఎర్తింగ్ వైర్లకు తగిలి చనిపోగా.. పశువైద్యాధికారి విజయ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు.