న్యూ బ్యారేజ్ సెంటర్లో వాహనాల తనిఖీలు
SKLM: హిరమండలం మండల కేంద్రం న్యూ బ్యారేజ్ సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ వి.హేమంత్ కళ్యాణ్ తమ సిబ్బందితో కలసి ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. మైనర్లు, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ దొరికిన వారిని మొదటిసారిగా హెచ్చరించి వదిలిపెట్టారు. మరోసారి పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.