మృకుండ మల్లేశ్వర స్వామికి పూజలు

మృకుండ మల్లేశ్వర స్వామికి పూజలు

KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం గ్రామ శివారులో వెలసిన మృకుండ మల్లేశ్వర స్వామి దేవాలయంలో మల్లేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.