డివైడర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

ATP: అనంతపురం నగర శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ బైక్ మీద అనంతపురం నుంచి హిందూపూర్‌కి వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అవినాష్‌కు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు.