బ్లడ్ టెస్ట్ రిపోర్టుల కోసం ఆదివాసుల పడిగాపులు
ASR: పాడేరు జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ టెస్ట్ రిపోర్టుల కోసం గిరిజన రోగులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారని కలెక్టరేట్ ఎస్సీ, ఎస్టీ జిల్లా కమిటీ సభ్యుడు చేండా లోహితాసుడు ఆరోపించారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న రోగులకు సమయానికి రిపోర్టులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపించారు.