రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మండలం వెంకటాపురం దగ్గర గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం వ్యాన్ బైకును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వెంకట్ రెడ్డి, చిన్న యాకూబ్గా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.