భీమవరంలో కాంగ్రెస్ ఘన విజయం
KMM: ఎర్రుపాలెం మండలంలో ఓ సర్పంచ్ ఫలితం వెలువడింది. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికలో భాగంగా భీమవరంలో ప్రజలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కోట వజ్రమ్మ వైపు మొగ్గు చూపారు. 30 ఓట్ల తేడాతో ఆమె సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.