VIDEO: ప్రజల వినతులు స్వీకరించిన కొండా మురళి
హనుమకొండ రామ్నగర్లోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలను సహృదయంతో విని, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.