స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కరపత్రాలతో ప్రచారం

స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కరపత్రాలతో ప్రచారం

AKP: స్టీల్ ప్లాంట్ రాకతో అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారతాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కూటమి నాయకులతో కలిసి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు.