46 గుడుల కూల్చివేతపై పోలీసులకు ఫిర్యాదు
PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలో 46 గుడుల కూల్చివేతపై హిందూ ఐక్య వేదిక నాయకులు గోదావరిఖని వన్హెన్, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. గుడుల కూల్చివేతను చట్టవిరుద్ధంగా నిర్వహించారని ఆరోపించారు. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా విచారణ చేసి, నగర ఇంఛార్జ్ కమిషనర్పై, గుడుల విధ్వంసంలో పాల్గొన్న అధికారులపై కేసులు నమోదు చేయాలన్నారు.