మంత్రి సుభాష్తో వీరంకి గురుమూర్తి భేటీ
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ను కలిశారు. మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జిల్లాలో పార్టీ బలోపేతం, కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.