జిల్లాలో ప్రారంభమైన పోలింగ్
SRD: జిల్లాలో సంగారెడ్డి కంది, కొండాపూర్, సదాశివపేట, గుమ్మడిదల, హత్నూర, పటాన్ చెరు మండలాలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉ 7 గంటల నుంచి మ 1 గంట వరకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మ 2 గంటలకు ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.