తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,067 మంది భక్తులు దర్శించుకోగా.. 25,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారి హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.