రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా
SRD: సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి నిర్మల మంగళవారం తెలిపారు. టీమ్ రెడ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థలో గోల్డ్ లోన్ ఎగ్జిక్యూటివ్గా పని చేసేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు.