VIDEO: కాంగ్రెస్కు భారీ మెజార్టీ: మల్లు రవి
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ విధానాన్ని చూస్తే.. బైపోల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది.