నిరుద్యోగ మైనార్టీలకు గుడ్ న్యూస్
SRD: జిల్లాలోని నిరుద్యోగ మైనార్టీ యువతకు ఈ-స్కూటీల పంపిణీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. అర్హులు మార్చి 1వ తేదీలోపు tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి కార్పొరేషన్ రూ.1.20 లక్షలు అందజేస్తుంది.