ఏటీఎం సెలవు రోజుల్లో మూసివేయడంతో ఇబ్బందులు
KRNL: దేవనకొండలోని SBI ఏటీఎం సాధారణ పని గంటల్లో మాత్రమే పనిచేస్తోంది. ఆదివారాలు, పండుగ రోజుల్లో మూసివేయడం వల్ల స్థానికులు, ఉద్యోగులు, వ్యాపారులు నగదు అవసరమైతే సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఏటీఎంలను 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.