ఈ నెల 17న ఎంప్లాయిస్ గ్రీవెన్స్
PPM: ఈ నెల 17వ తేదీ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.