వరల్డ్ కప్తో క్రికెటర్ల ఫొటోలు.. వైరల్
ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా జట్టు క్రికెటర్లు విజయానందంలో మునిగిపోయారు. ప్లేయర్లు ప్రపంచకప్ ట్రోఫీతో కలిసి ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ వంటి కీలక ప్లేయర్లు ట్రోఫీతో తాము తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.