ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ
SDPT: అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు స్వగ్రామమైన బొప్పాపూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సూచించారు.