ఆటో బోల్తా పడి పదవ తరగతి విద్యార్థి మృతి

ఆటో బోల్తా పడి పదవ తరగతి విద్యార్థి మృతి

WGL: గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఆటో బోల్తా పడిన సంఘటనలో పదవ తరగతి విద్యార్థి అక్షయ్ మృతి చెందాడు. నిన్న రాత్రి ఆటోలో నీళ్లు తరలిస్తున్న సమయంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. తీవ్ర గాయాలైన బాలుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అక్షయ్ ఇప్పటికే మూడు పరీక్షలు రాసాడు. అతని మృతితో తల్లిదండ్రులు కన్నీళ్లు మున్నీరుగా విలపించారు.