ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
BHPL: మొగుళ్ళపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అంతకుముందు మొట్లపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 99 రోజులపాటు జరిగే ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.